వైసీపీ ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు-బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
నేటి ఆధునిక యుగంలో కనీసం తాగునీటి అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నందవరం మండలం ముగతిలో ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసిపి ప్రభుత్వంలో కరెంట్ బిల్లులను ముడితే షాక్ కొడుతుందని చమత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.