నందికొట్కూరు: కోడలిపై మామ అత్యాచారయత్నం.. దారుణ హత్య

61చూసినవారు
నందికొట్కూరు: కోడలిపై మామ అత్యాచారయత్నం.. దారుణ హత్య
నందికొట్కూరు మండలం నాగటూరులో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శిరీష అనే మహిళ ఎప్పటిలాగే పొలం పనులకు వెళ్ళింది. ఈ తరుణంలోనే కోడలుపై మామ కురుమన్న అత్యాచారయత్నం చేశాడు. అయితే శిరీష తిరస్కరించడంతో మామ కురుమన్న ఆగ్రహంతో బండరాయితో ఆమె కొట్టి చంపేశాడు. శిరీష ముఖం నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

సంబంధిత పోస్ట్