
నంద్యాల: హైందవ శంఖారావానికి అర్చక సమాఖ్య మద్దతు
రాష్ట్రంలో దేవాలయాలపై, అర్చకులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్చక, పురోహిత సమావేశం ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల నుండి 150 మంది అర్చక పురోహితులు సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య వక్తలు శివ శంకర్, విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నెలకు రెండు సార్లు దేవాలయం కేంద్రంగా హారతి కార్యక్రమం నిర్వహించాలని, అర్చక సమాఖ్య హైందవ శంఖారావానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు.