పాణ్యం: బ్యాంకు ఖాతాలో నగదు మాయం

55చూసినవారు
పాణ్యం: బ్యాంకు ఖాతాలో నగదు మాయం
పాణ్యం మండలం గోరుకల్లుకు చెందిన ఉప్పరి గౌతమకుమార్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 9, 991 నగదు మాయమైంది. బుధవారం బాధితుడు మాట్లాడారు. తన యూనియన్ బ్యాంక్ లో ఉన్న ఖాతాలో రూ. 50 వేలలో రూ. 40 వేలు విత్ చేశానని, మిగిలిన సొమ్ములో రూ. 9, 991 నగదు మాయమైందన్నారు. బ్యాంకు మేనేజర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు ఎలాంటి ఓటీపీ గానీ, నకిలీ ఫోన్ కాల్స్ గానీ రాలేదని, అయినా ఖాతాలోని నగదు మాయమైనట్లు వాపోయారు.

సంబంధిత పోస్ట్