ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేసుకోవాలి

83చూసినవారు
ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేసుకోవాలి
కృష్ణగిరి మండలంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో మద్దయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈనెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు 9, 10 తరగతులతో పాటు ఇంటర్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఏడాదికి రూ. 12వేల స్కాలర్షిప్ వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్