నియోజకవర్గంలలోని బీసీలంతా టీడీపీ నేత బీవీ జయనాగేశ్వరరెడ్డి వైపు ఉన్నారని, ఆయన విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తారని హెచ్ కైరవాడి గ్రామ టీడీపీ నాయకులు రాజేష్, శ్రీరాములు, రామగోపాల్, అబుబక్కర్ అన్నారు. మంగళవారం గోనెగండ్ల బీసీ నాయకులుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో బీసీ లకు ఏ సమస్య వచ్చినా బీవీ తక్షణమే స్పందిస్తారని పేర్కొన్నారు.