మండల పరిధిలో సమయపాలన పాటించని ఉద్యోగులు

561చూసినవారు
ఎమ్మిగనూరు మండల పరిధిలోని కోటెకల్లు సచివాలయం ఉద్యోగులు విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం సమయపాలన పాటించలేదు. ఈ సచివాలయంలో దాదాపు 8 మంది అధికారులు విధులు నిర్వర్తిస్తుండగా ఉదయం 11 కావొస్తున్నా ఒకరిద్దరు మాత్రమే విధులకు హాజరయ్యారు. సిబ్బంది రాకపోవడం వల్ల వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్