ఏపీలోని విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని(17) కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్రావు వేధింపులే కారణమని భావిస్తున్నారు. నిందితులు శంకర్ వర్మ, భాను ప్రవీణ్, ఉషారాణి, ప్రదీప్ కుమార్లను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.