భూముల రీసర్వే.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

57చూసినవారు
భూముల రీసర్వే.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
భూముల రీసర్వేపై ఏపీ ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. కాగా, భూ సమస్యలపై గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రైతులు ఫిర్యాదులు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్