YCP ఎంపీలను బీజేపీలో చేర్చుకోం: సోమువీర్రాజు

81చూసినవారు
YCP ఎంపీలను బీజేపీలో చేర్చుకోం: సోమువీర్రాజు
వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత సోమువీర్రాజు స్పష్టం చేశారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి పార్టీలో చేరుతారన్న ప్రతిపాదన కానీ, ఆలోచన కానీ లేదన్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్