ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఇవాళ నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. "లోకేశ్ ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది నేను గర్వపడే, భావోద్వేగానికి గురైన క్షణం. నూతనోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు మంత్రిగా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నా." అని బ్రాహ్మణి పేర్కొన్నారు.