కాంగ్రెస్‌లో చాలామంది చేరతారు: గిడుగు

51చూసినవారు
కాంగ్రెస్‌లో చాలామంది చేరతారు: గిడుగు
కాంగ్రెస్ పార్టీలో త్వరలో చాలామంది చేరబోతున్నారని ఏపీ పీసీసీ మాజీచీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే దానిపై ఇప్పటికే తాను, షర్మిల మాట్లాడుకున్నామని వెల్లడించారు. పార్టీలో చేరేందుకు తమతో చాలా మంది టచ్‌లో ఉన్నారని.. వైసీపీ నుంచి ఎవరెవరు వస్తారనే విషయాలను షర్మిలే చెబుతారని వ్యాఖ్యానించారు. షర్మిల బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో పార్టీ పెద్దలు పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్