ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వచ్చి పడతాయా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణంరాజు ఒక సభ్యుడు 60 రోజుల కంటే ఎక్కువ రోజులు సభకు దూరంగా ఉంటే అతని సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పారు. ఏపీలో 11 సీట్లు తప్ప అన్నీ కూటమి చేతిలో ఉన్నాయి. పక్కాగా వ్యూహరచన చేస్తే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు మొత్తం ఒక్క దెబ్బకు రద్దు అవుతాయని, ఆరు నెలలు తిరగకుండా ఉప ఎన్నికలు వచ్చి పడతాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.