విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు: మంత్రి లోకేష్

85చూసినవారు
విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు: మంత్రి లోకేష్
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్షా ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సాల్ట్ ప్రాజెక్టు ద్వారా హెడ్‌మాస్టర్లు, ఎస్‌జీటీలకు సమగ్ర శిక్షణ ఇవ్వాలన్నారు. పుస్తకాల్లో రాజకీయ రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్