ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిందంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. వైద్య వృత్తిలో విలువలు లేకుండా పోయాయని ఆయన పేర్కొన్నారు. "చిన్న రోగానికే స్కానింగ్లు తీస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయడం మానేశారు. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు" అని మంత్రి వ్యాఖ్యానించారు.