AP: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి నారా లోకేశ్ పార్టీ సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలని సూచించారు. ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రతి ఓటరును అభ్యర్థించాలని తెలిపారు. కూటమి నాయకులంతా కలసికట్టుగా పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి కృషిచేయాలని పేర్కొన్నారు.