వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్కి ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఎద్దేవా చేశారు. 'ఈ 50 రోజుల ప్రభుత్వంలో మేం భయంతో ఉండటం కాదు.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారు. అధికారం దూరమైందన్న బాధ, అక్రమార్జన ఆగిపోయిందన్న ఆవేదన'లో ఉన్నారని మంత్రి లోకేష్ చురకలు అంటించారు.