మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తాం: ప్రధాని మోదీ

582చూసినవారు
మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తాం: ప్రధాని మోదీ
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఇందుకోసం కఠిన చట్టాలను మరింత పటిష్ఠ పరుస్తున్నామని చెప్పారు.‘మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్