అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మహిళలకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా.. మహిళల సాధికారత కల్పించడానికి
కాంగ్రెస్ పార్టీ ‘ఇందిరమ్మ అభయం’ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు నెలకు రూ.5 వేలు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇదే మహిళలకు
కాంగ్రెస్ ఇస్తున్న భరోసా అని పేర్కొన్నారు.