వైసీపీ పాలనలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇష్టమైన కేసు పెట్టుకోవాలని, దేనికీ తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు.