టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ భరత్ మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీ విషయంలో అవ్వాతాతలు, దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు లేకుండా ఇళ్ల వద్దకు పెన్షన్లు ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడానికి అడ్డుకున్నామని టీడీపీ నేతలు కాలర్ ఎగరేసి తిరుగుతున్నారని మండిపడ్డారు.