పెన్షన్ల పంపిణీలో జాప్యంపై ఏపీ ఎన్నికల కమిషన్కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఇప్పటికీ పెన్షన్ల నిధులు సచివాలయాలకు అందలేదని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు మంచంపై వృద్ధులను మోసుకొస్తూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని చెప్పారు. ఇళ్ల వద్దే పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.