చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేశ్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2019లో మోడీ అధికారంలోకి రారని చంద్రబాబు అన్నారని, కాంగ్రెస్ కూటమితో చేయి కలిపి ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలవాలనుకుంటున్నారని మండిపడ్డారు.