ఆళ్లగడ్డలో అంగరంగ వైభవంగా గణనాధుల నిమజ్జనం

58చూసినవారు
ఆళ్లగడ్డలో అంగరంగ వైభవంగా గణనాధుల నిమజ్జనం
ఆళ్లగడ్డలో బుధవారం గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి.. ఐదు రోజులుగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదిరిన గణనాధులు నిర్వాహకుల, భక్తుల నుండి పూజలు అందుకున్నారు. ఇది ఇలా ఉండగా అమ్మవారి శాల లడ్డు ప్రసాదాన్ని నాలుగు రోడ్ల కూడలిలో వేలం వేయగా అధ్యాపకులు గుణశేఖర్ దంపతులు 15 వేలకు వేలం పాడి దక్కించుకున్నారు. దారి పొడవునా గణనాధుల వెంట కోలాటాలు, చెక్కభజనలు, ప్రత్యేక వేషధారణలో చూపరులకు కనువిందు కలిగించాయి.

సంబంధిత పోస్ట్