ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు బుధవారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. అఖిలప్రియ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామని వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భూమా అఖిలప్రియ నాయకత్వంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేసి పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.