మొహరం సందర్భంగా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వెలసిన శ్రీ హసేన్ హుసేన్ పీర్ల స్వామివారిని మంగళవారం ఆలూరు టీడీపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన గ్రామదైవం అయిన శ్రీగురు గాది లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమావేశారు. యువ నాయకులు గిరిమల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.