ఎన్నికల కోడ్ తర్వాత ఆసుపత్రికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన బనగానపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గత నెల 14న సీఎం జగన్ చేత ఆస్పత్రిని ప్రారంభించామని, 16న ఎన్నికల కోడ్ వచ్చిందని, అందువల్ల ఎక్విప్మెంట్ సమకూర్చలేక పోయామన్నారు.