కారులో భారీగా తరలిస్తున్న కర్ణాటక మద్య పట్టివేత

50చూసినవారు
కర్ణాటక నుంచి కారులో ఇతర ప్రాంతాలకు 15 బాక్స్ ల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని శనివారం కోడుమూరులో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని అరెస్టు చేసి, మరో వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు, మద్యం తరలిస్తున్న కారును సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. ఉల్చాలకు చెందిన గడ్డం నాయుడు తన కారులో 15 బాక్స్ లో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని గుర్తించారు.

సంబంధిత పోస్ట్