గూడూరు పట్టణంలో తిమ్మగురుడు స్వామి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ శనివారం దర్శించుకున్నారు. వారు స్వామివారి మూల విగ్రహాన్ని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. మున్సిపల్ చైర్ మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్ మన్ లు పీఎన్ అస్లామ్, నాయకులు ఎల్. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.