సబ్సిడీ శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

64చూసినవారు
సబ్సిడీ శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
కోడుమూరు మండలంలో రబీ సీజన్ కుగాను ప్రభుత్వం మండలానికి 2, 200 క్వింటాళ్ల సబ్సిడీ శనగ విత్తనాలను మంజూరు చేసిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో రవిప్రకాష్ సూచించారు. మంగళవారం వర్కూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించారు. పత్తి, కంది, ఆముదం పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏవో రైతులకు వివరించారు. 25 శాతం సబ్సిడీ పోను, రైతుకు క్వింటాం శనగలకు రూ. 7, 050 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్