10వ తరగతి విద్యార్థిని పార్వతి మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి

79చూసినవారు
10వ తరగతి విద్యార్థిని పార్వతి మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి
మంత్రాలయం మండల పరిధిలోనే రచ్చమర్రి గ్రామ పరిధిలో ఏపీ మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కె పార్వతి ఆత్మహత్య వెనుక అనుమానాలు ఉన్నాయని ఈ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం మోడల్ స్కూల్ హాస్టల్లో జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ శ్యాముల్ కి వినతిపత్రం అందజేశారు. విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖాజా కృష్ణ మాట్లాడుతూ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ మరియు వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్