పాణ్యం: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

54చూసినవారు
పాణ్యం: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. గురువారం ఓర్వకల్లు మండలంలోని హుశేనాపురం రైతుభరోసా కేంద్రంలో రైతులకు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలానికి 2, 650 క్వింటాళ్ల పప్పు శనగ విత్తనాలు మంజూరయ్యాయని తెలిపారు. రైతులు శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్