జిల్లాలో 134 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

60చూసినవారు
జిల్లాలో 134 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు జిల్లాలో సమయ పాలన పాటించని, సకాలంలో హాజరు వేయని 134 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంగళవారం డీఈవో కాగిత శామ్యూల్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 23న జిల్లాలో 300 మందికిపైగా ఉపాధ్యాయులు ఫేషియల్ అటెండెన్స్ వేయలేదు. ఈ విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి చాలా మండలాల్లో ఉపాధ్యాయులు స్కూల్ కు హాజరైనా కూడా నిర్దేశిత సమయంలోపు యాప్ అటెండెన్స్ నమోదు చేయడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్