పత్తికొండ: మూడేళ్ల క్రితం తండ్రి.. ఇప్పడు తల్లి మృతి

71చూసినవారు
పత్తికొండ: మూడేళ్ల క్రితం తండ్రి.. ఇప్పడు తల్లి మృతి
మూడేళ్ల క్రితం తండ్రి గుండెపోటుతో మృతి చెందగా, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఆదివారం పత్తికొండ మండలం చందోలికి చెందిన తుప్పటి లక్ష్మి (34)కి మారెల్లకు చెందిన అంజినయ్యతో వివాహం జరిగింది. వీరికి జయశ్రీ (13), అంకిత (10), ఉషశ్రీ (5) కూతుళ్లు ఉన్నారు. మూడేళ్ల క్రితం అంజినయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లిన లక్ష్మి, ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుతో మృతి చెందింది.

సంబంధిత పోస్ట్