శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లాకు చెందిన వెలంకి సీతరామదాసు అనే భక్తుడు రూ. 1, 00, 007 విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధిత విరాళ సొమ్మును అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.