ఏపీ మంత్రిగా నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్లో ఉన్న తన ఛాంబర్లో ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను కేబినెట్ ముందుపెట్టే ఫైలుపై ఆయన సంతకం పెట్టారు.