తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర

61చూసినవారు
తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర
AP: రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం మొదలుపెట్టిన పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. 20 రోజుల పాటు ఇది కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్