పుస్తకాల భారం.. విద్యార్థులకు శాపం

50చూసినవారు
పుస్తకాల భారం.. విద్యార్థులకు శాపం
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది. అడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్తకాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఏటా పై తరగతికి వెళ్తుంటే.. పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు.. బ్యాగు నిండా పుస్తకాలతో నాలుగైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలామంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యలతో సతమతమవుతున్నారు.

సంబంధిత పోస్ట్