కలవల్ల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి

69చూసినవారు
కలవల్ల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామంలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ గత వంద రోజులుగా కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. త్వరలోనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని తెలిపారు. కందుకూరు నియోజకవర్గం జిల్లాలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్