కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గెలిచిన సందర్భంగా ఆయన అభిమానులు మొక్కుబడితో, కందుకూరు నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపానికి చేరుకుంది. ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య కుమారులు అవినాష్, సందీప్ తో పాటు చెరుకూరి వంశీకృష్ణ, ఝాన్సీరాణి, తదితరులు పాదయాత్ర చేస్తున్న వారిని కలిసి సంఘీభావం తెలిపారు. తిరుమల చేరుకునే వరకు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.