యమపాశాలుగా మారుతున్న విద్యుత్ తీగలు

61చూసినవారు
యమపాశాలుగా మారుతున్న విద్యుత్ తీగలు
విద్యుత్‌ ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్‌ తీగలు యమపాశాలుగా మారి ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. నివాస గృహాలు, పంటచేలలో జరిగే ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. పంట చేలకు నీరు పెట్టేందుకు మోటార్‌ ఆన్‌చేస్తుండగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదాల నివారణకు విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడంలో విఫలమవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్