యూపీ రైలు ప్రమాదంలో 4కు చేరిన మృతుల సంఖ్య (వీడియో)

61చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో గురువారం మధ్యాహ్నం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చండీగఢ్‌-దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మొత్తం నాలుగు ఏసీ బోగీలు సహా 8 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. శుక్రవారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 31మందికి గాయాలైనట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్