కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి

71చూసినవారు
కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి
కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో చోటు చేసుకుంది. ఏశమల్ల జయమ్మ (54) అనే మహిళ తన ఇంట్లో ఉన్న విద్యుత్ మోటార్‌ను సరి చేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె బండ్ల మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్