బుచ్చి: రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి

76చూసినవారు
బుచ్చి: రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి
బుచ్చి మండలం పరిధిలోని మునలపూడి, శ్రీరంధపురం, గ్రామాల్లో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం "పొలం పిలుస్తోంది" కార్యక్రమం జరిగింది. రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాధించాలని మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. పంటలో తెగుళ్లను గుర్తించి వ్యవసాయ అధికారుల సలహాలతో నివారణ మందులు వాడాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులు అధిక లాభాలను పొందవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్