జగదేవిపేట ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారి

73చూసినవారు
జగదేవిపేట ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారి
ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇన్ చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఖాదర్ వలీ మంగళవారం సందర్శించారు. పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లు, ఐఎల్ఆర్, డిప్ ఫ్రీజర్స్ పరిశీలించారు. వ్యాక్సిన్ క్యారియర్స్, ఐస్ ప్యాక్స్ సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో కాన్పుల సంఖ్యను పెంచాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్