వైసీపీలో చేరిన న్యాయవాది
మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి నివాసంలో మంగళవారం ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది నంద ఓబులేసు వైసీపీ పార్టీలో చేరారు. ఆయనకు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అభిమానులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.