కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత (వీడియో)

56చూసినవారు
తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో గురువారం మంత్రి కొండా సురేఖ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అధికారం లేకున్నా స్టేజి పైకి కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రోటోకాల్ పాటించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్