ఆస్ప‌త్రిలో చేరిన సీఎం

80చూసినవారు
ఆస్ప‌త్రిలో చేరిన సీఎం
పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌ మరోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. బుధ‌వారం అర్ధరాత్రి ఆయ‌న్ను ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు స‌మాచారం. మూడుసార్లు ఆయ‌న స్పృహ కోల్పోయి నీర‌సించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు మెడిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కాగా, ఇటీవలే ఆయన వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్