ప్రధాని సమక్షంలో చెస్‌ ఆడిన ప్రజ్ఞానంద్‌, అర్జున్‌ (Video)

54చూసినవారు
నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్‌ (హంగేరి) వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్‌, మహిళల విభాగాల్లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. స్వర్ణాలు గెలిచిన భారత బృందం టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మోదీని కలిశారు. ఇక ప్రధాని సమక్షంలో ప్రజ్ఞానంద్‌, అర్జున్‌ ఓ గేమ్‌ కూడా ఆడారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రధానికి చెస్‌ బోర్డును గిఫ్ట్‌గా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్