హైద్రాబాద్ ప్రపంచ స్థాయిలో ఉందంటే చంద్రబాబు ఫౌండేషన్ వల్లే : వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి

75చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజు పాలెం విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు.చంద్రబాబు వస్తేనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వస్తాయని,యువత ఉద్యోగావకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని, ఈ వలసలను ఆపాలన్నా, గ్రామాలు బాగు పడాలన్నా చంద్రబాబు నాయుడు ని గెలిపించుకోవాలన్నారు. హైద్రాబాద్ ప్రపంచ స్థాయిలో ఉందంటే చంద్రబాబు ఫౌండేషన్ వల్లే అని అన్నారు.ఉలవపాడు మామిడికి చాలా ప్రాధాన్యం ఉంది, ఈ ప్రాంతంలో ఒక పల్ఫ్ పరిశ్రమలు తీసుకువస్తే స్థానికంగానే ఉపాధి లభిస్తుందన్నారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు ని, ఎంపీగా తనను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్